BOOK OF NUMBERS -Pastor Stephen



యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో మీకు నా హృదయ పూర్వకమైన వందనాలు.ఈ విధముగా ఈ ప్రశస్తమైన సమయములో దేవుని లేఖనములలో నుండి కొన్ని విషయాలను ధ్యానము చేయడానికి ప్రభు సహాయాన్ని కోరుకుందాము.ఈ ప్రశస్తమైన సమయములో "సంఖ్యాకాండములో "ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము.

*ఈ ప్రశస్తమైన సమయములో "సంఖ్యాకాండములో "ఒక విషయాన్ని ధ్యానము చేద్దాము.సంఖ్యాకాండము లో మొత్తము 36  అధ్యాయాలు ఉన్నాయి.
*1288 వచనములు ఉన్నాయి.
*వాగ్దానాలు -5
*నెరవేరని ప్రవచనములు-15 
*నెరవేరిన ప్రవచనాలు-42
* ప్రశ్నలు -59
*ఆజ్ఞలు -554
*దేవుని సందేశములు -72 ఉన్నాయి.
*ఈ సంఖ్యాకాండములో దేవుడు మోషే తో మాట్లాడుట -150 సార్లు,
దేవుడు మహిమతో కనబడుట -20 సార్లు  కనపడుతుంది.
*మొదటి 10 అధ్యాయాలలో  50 రోజుల చరిత్ర ,
*నిర్గమాకాండములో 1 సంవత్సరము,
*లేవికాండములో ఒక నెల,
సంఖ్యాకాండములో38 సంవత్సరాలు  చరిత్ర కనపడుతుంది


✦✦✦సంఖ్యాకాండము మూడు విధములుగా విభజింపబడింది.
{1}ప్రయాణముకైన సిద్డపాటు -ప్రయాణ ప్రారంభము  1-13 
{2}అవిశ్వాసము వలన తిరుగులాడిన స్థితి 14-25
{3}కనానును ఆక్రమించుకున్న క్రొత్త తరమును సిద్ధపరచుట  26-36

👉ఇశ్రాయేలీయులు అవిశ్వాసము,అవిధేయత వలన దాదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో సంచరించిన చరిత్రనే సంఖ్యాకాండము చెప్పుచున్నది.హీబ్రూ భాషలో దీనికి చెప్పబడిన మొదటి మాట "వాక్వేబార్ "{చెప్పబడినది}అంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అని దాని అర్ధము.
కాదేషు బర్నేయలోనుండి కన్నాకు వెళ్ళడానికి 11 రోజులే కానీ 40 సంవత్సరాలు ఎలా మారినది.మొదటి 10 అధ్యాయాలలో ఇశ్రాయేలీయులు చక్కగా ప్రయాణించారు కానీ 10 వ అధ్యాయము  నుండి వారి మనస్సులు,విశ్వాసము,దేవుని చూచే విధానము అన్నీ మారిపోయినవి.అందుకే....ఆ 11 దినాల ప్రయానాన్ని దేవుడు 40 సంవత్సరాలుగా చేసాడు.
కారణములు చాల ఉన్నాయి కానీ ఈ  సమయములో మనము ఒక చిన్న విషయాన్ని ధ్యానము చేద్దాము.

👉11 అధ్యాయములో  మాంసము కోసము,ఆ తరువాత  12 లో మోషే భార్య విషయములో జాతి కొరకు,ఆ తరువాత 13 లో దేవుని తీర్పు విధానాలను,ఆయన నడిపించే  తీరునే సందేహిస్తూ సనగడము,ప్రారంభమైనది.
దేవుని ఉద్దేశ్యాన్ని విచారణ చేసేంత గర్వము,అహంకారము వారిని ఆ అరణ్యములోనినే రాలిపోవునట్లు చేసింది.

🕮యెహెఙ్కేలు-20:5,6   ఎట్లనగా ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన నాడును, యాకోబు సంతతికి ప్రమాణముచేసిన నాడును, ఐగుప్తుదేశమందు నన్ను వారికి ప్రత్యక్ష పరచుకొని ప్రమాణముచేసి నేను మీ దేవుడనైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున 6. వారిని ఐగుప్తుదేశములోనుండి రప్పించి వారికొరకు నేను విచారించినదియు, పాలు తేనెలు ప్రవహించునదియు, సకల దేశములకు ఆభరణమైనదియునైన దేశములోనికి తోడుకొని పోయెదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసితిని.

🕮సంఖ్యాకాండము 13:17-21 మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను మీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో18. దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో19. వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,20. దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము21. కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.


👉దేవుడు ఉద్దేశ్యించి,నిర్ణయించిన మార్గాన్ని నమ్మలేని,భక్తి జీవితo ఎన్నడూ దేవుని వాగ్దానాలను చూడలేదు.ఆ భక్తిహీనతే వారిని ముప్పైయెనిమిది సంవత్సరాలు తిరుగులాడునట్లు చేసింది.దేవుడు విచారించింది ,మరల మనము విచారించాలా?అంటే ఎవరిదీ జ్ఞానము?మనదా ?దేవునిదా?ఒకసారి దేవుడు నీవు నడవాల్సిన మార్గమును పరిశీలనగా విచారించగా...ఇంకా నువ్వు ఆలోచించేది ఏంటి?అసలు నిజముగా దేవుని తీర్పును నమ్మని నీవు,గౌరవించని నీవు ,ఆయనను ఏ మాత్రం మహిమపరచగలవు ?అది అసాధ్యము !ఎప్పుడైతే వారు దేవుని వాగ్దాన దేశాన్ని విచారించాలి,అనుకున్నారో అప్పుడే వారు ఆ కృపను కోల్పోయారు.నిజముగా అసలు ఆ దేశము ఉందా ?అక్కడ భూమి ఎలా ఉంది?సారమైనదేనా?అక్కడ నివాసములు ఉన్నాయా?దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో?వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,దానిలో చెట్లున్నవో లేవో?నిజముగా ఆలోచనలు విన్నప్పుడు దేవుని మనస్సు ఎంత బాదపడియుంటుందో!అందుకే....వారిని నలభై సంవత్సరాలు  అక్కడక్కడే తిప్పి తిప్పి తిరుగులాడునట్లు చేసాడు .మన జీవితములో కూడా అంతే .మొదట మన జీవితాల్లో మనము దేవుని నిర్ణయాలను,ఉద్దేశ్యాలను ,ఆయన మార్గాలను గౌరవించడము నేర్చుకోవాలి....



ఆ తరువాత విశ్వాసము.నీ విశ్వాసము ....గౌరవములోనుండి రావాలి.ఆ గౌరవము లేకపోతె నీ నమ్మకము వృదాయే!చాలామంది నమ్మకముంచుతారు కానీ ఆ నమ్మకము లో కొంచెము కూడా గౌరవము  ఉండదు.ఆ గౌరవము లేనందు వల్లనే వారిలోని నమ్మకము చాల సులువుగా కరిగి నీరైపోతుంది .ఇశ్రాయేలీయులు నమ్మకముంచారు కానీ,ఏమాత్రము గౌరవము లేదు.అందుకే 
ఆయనను సందేహించడానికి,ఆయన గురించి గొణగడానికి ఏ మాత్రమూ సంకోచించలేదు.ఈ ప్రశస్తమైన  సమయములో ప్రియ దేవుని బిడ్డా...నిజముగా నీవు దేవుని ఎంత గౌరవిస్తున్నావు?ఒక్కసారి నిన్ను నీవు పరిశిలన చేసుకో !నీ నమ్మకము,విశ్వాసము దేవుని మీద గౌరవము తో నిండియున్నదా?ఆ గౌరవము లేకపోతె మనము కూడా ఇశ్రాయేలీయులు వలెనె ఆయన ను అగౌరవపరచి కృపలను పోగొట్టుకుంటాము.ప్రభు సహాయము వేడుకుందాము.దేవుడు ఈ మాటలన్నీ మనకొరకు దీవించును గాక.ఆమెన్ ఆమెన్ ఆమెన్!

                                                                                           పాస్టర్ స్టీఫెన్ 

Comments

Popular posts from this blog

THE MOST CRITICIZED MISSIONARY~JOHN ALLEN CHAU @Stephy Blesseena

వాగ్దాన దేశములోనుండి ఐగుప్తులోని కరువు లోనికి ఎందుకు?By PASTOR STEPHEN

ప్రేమలో క్రొత్తగా జన్మిస్తున్నాము-Stephy Blesseena